మెగా వర్సెస్ అల్లు.. ఏం పీకలేరు బ్రదర్!
on May 24, 2022
మొన్నటి వరకు మెగా ఫ్యామిలీలోనే అల్లు కుటుంబం కూడా భాగమనే అభిప్రాయముండేది. కానీ కొంతకాలంగా మెగా బ్రాండ్ నుంచి దూరం జరిగి తనకంటూ సెపెరేట్ గా అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నాడన్న మాట వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనే అభిప్రాయం కలుగుతోంది.
ఆదివారం విజయవాడలో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్స్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. బన్నీ ఫోటోకి అక్కడ స్థానం లభించలేదు. ఉద్దేశపూర్వకంగానే మెగా అభిమానులు బన్నీ ఫోటోని పెట్టలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు ఒక సినిమా వేడుకలో ఫ్యాన్స్ నుంచి పవర్ స్టార్ స్లోగన్స్ వినిపిస్తున్న సమయంలో 'చెప్పను బ్రదర్' అన్న బన్నీ మాట చాలా పాపులర్ అయింది. దానిని పవన్ ఫ్యాన్స్ నెగటివ్ గా తీసుకొని ట్రోల్ చేశారు. అయితే బన్నీ మాత్రం ఎన్నికల సమయంలో పవన్ కి చెందిన 'జనసేన' పార్టీకి మద్దతు తెలపడం విశేషం. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మెగా వర్సెస్ అల్లు పోరు స్టార్ట్ అయింది. మెగా ఫ్యాన్స్ బ్యానర్ లో బన్నీ ఫోటో పెట్టకపోవడమే కాకుండా.. కొందరు 'చెప్పను బ్రదర్' అంటూ పరోక్షంగా బన్నీపై కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా 'ఏం పీకలేరు బ్రదర్' అంటూ బన్నీ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు బన్నీ మెగా ఫ్యామిలీ కాదని.. బన్నీకి నేషనల్ వైడ్ గా ఓన్ ఫ్యాన్ బేస్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయంలో మిగతా హీరోల ఫ్యాన్స్ మద్దతు కూడా తమకే ఉందని అంటున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ వారి ధీటుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మెగా వర్సెస్ అల్లు రచ్చ ప్రస్తుతం ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read