మూగబోయిన "మురళీ"రావం..
on Nov 22, 2016
ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1930 జూలై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన జన్మించారు. కర్ణాటక సంగీతంలో విద్వాంసుడిగా కీర్తిగడించిన ఆయన వీణ, మృదంగం, కంజీరలు వాయించడంలో నిష్ణాతులు. ఎన్నో సినిమాల్లో పాటలు పాడి అలరించారు. భారతీయ సంగీతానికి ఆయన చేసిన సేవలకు గానూ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో భారత ప్రభుత్వం మురళీని గౌరవించింది.