చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.. మంచు మనోజ్ స్పీచ్ వైరల్
on May 26, 2025
మంచు మనోజ్(Manchu Manoj)బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai srinivas), నారా రోహిత్(Nara Rohith)హీరోలుగా తెరకెక్కిన 'భైరవం'(Bhairavam)మూవీ ఈ నెల 30 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala)దర్శకత్వంలో, గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన రాధామోహన్, శ్రీ సత్యసాయి బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ప్రముఖ దర్శకుడు శంకర్(Shankar)కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా చేస్తుంది. ట్రైలర్, సాంగ్స్, ప్రచార చిత్రాలతో మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. చిత్ర బృందం కూడా విజయంపై ధీమాతో ఉంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తు విజయ్ కనకమేడల పోస్ట్ చేసాడని, కాబట్టి భైరవం సినిమాని బాయ్ కాట్ చేయాలంటున్నారు. చిరంజీవి(Chiranjeevi)పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని విమర్శిస్తు విజయ్ పోస్ట్ చేసాడో లేదో తెలియదు. కానీ విజయ్ మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అందరు ఒక్కటై మనల్ని ఒంటరి చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వేరే ఎవరైనా తనని తిడుతుంటే విజయ్ పట్టించుకునేవాడు కాదు. సొంత కుటుంబం లాంటి మెగా ఫ్యాన్స్ విమర్శిస్తుంటే ఆయన్ని చూడలేకపోతున్నాను. మా సినిమాని మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చెయ్యాలి. పోస్ట్ విషయంలో మీరు ఇబ్బంది పడితే మా టీం తరుపున క్షమాపణలు చెప్తున్నాను. తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్నాను ఆశీర్వదించండని చెప్పుకొచ్చాడు.
మనోజ్ బాలనటుడిగా 1993 వ సంవత్సరంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు(Ntr)ఎవర్ గ్రీన్ హిట్ మూవీ 'మేజర్ చంద్రకాంత్' తో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. మొదటి సినిమాలోనే ఎలాంటి బెరుకు లేకుండా నటించి ఎన్టీఆర్ చేత శబాష్ అనిపించుకున్నాడు. సోలో హీరోగా 2004 లో విడుదలైన దొంగ దొంగది చిత్రంతో పరిచయమయ్యి ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తు వస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
