మహేష్ పిల్లలు మూడు భాషల్లో...
on Jul 1, 2020
‘భరత్ అనే నేను’ సినిమాలో ‘వచ్చాడయ్యో సామి’ పాటలో పంచెకట్టులో సూపర్స్టార్ మహేష్బాబు నడిచి వస్తే, పదహారణాలు తెలుగుతనం నడిచి వచ్చినట్టు అభిమానులకు అనిపించింది. ఆయన పెళ్లి చేసుకున్నది మరాఠీ మహిళ నమ్రతా శిరోద్కర్ని. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలనే సంగతి తెలిసిందే. అబ్బాయి గౌతమ్ ఎప్పుడూ ఎక్కువ మాట్లాడడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపిస్తాడు. మహేష్, నమ్రత ముద్దులు కూతురు సితార చలాకీగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. వాటిలో ఇంగ్లిష్ ఇరగదీస్తుంది. మధ్య మధ్యలో తెలుగు మాట్లాడుతుంది.
అసలు, గౌతమ్, సితారకి తెలుగు స్పష్టంగా మాట్లాడటం వచ్చా? ఓ అభిమానికి సందేహం వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో నమ్రతను అడిగారు. ‘‘తెలుగు, మరాఠీ, ఇంగ్లిష్లో గౌతమ్, సితార స్పష్టంగా మాట్లాడతారు’’ అని నమ్రత చెప్పారు. తెలుగు తండ్రి భాష అయితే, మరాఠీ తల్లి భాష. ఇంగ్లిష్ యూనివర్సల్ లాంగ్వేజ్. ఈ మూడు పిల్లలకు వచ్చాయన్నమాట. హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హిందీ కూడా వచ్చే ఉంటుంది. మహేష్కి మాత్రం మరాఠీ మాట్లాడలేదని నమ్రత తెలిపారు.
మహేష్, గౌతమ్, సితార పేర్లను చేతిపై నమ్రత టాటూగా వేయించుకున్నారు. రీసెంట్ ఇన్స్టాగ్రామ్లో టాటూ ఫొటోను పోస్ట్ చేశారు.