ప్రముఖ దర్శకుడి మిస్సింగ్.. చనిపోయాడనే అనుమానం!
on Jun 16, 2025
గుజరాత్(Gujarat)రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచివేస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 270 మంది మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన కొంతమందిని వాళ్ళ బంధువులకి అప్పగించేందుకు 'డిఎన్ఏ' పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు.
ఇక ఈ ప్రమాదం జరిగిన రోజు ప్రముఖ దర్శకుడు 'మహేష్ జీరావాలా'(Mahesh Jirawala)కనిపించడం లేదు. ఈ విషయంపై ఆయన భార్య మాట్లాడుతు 'ప్రమాదం జరిగిన రోజు మహేష్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న 'లా గార్డెన్'(Law Garden)కి వెళ్ళాడు. గురువారం మధ్యాహ్నం ఒకటి పద్నాలుగు నిమిషాలకి ఫోన్ చేశాను. మీటింగ్ అయిపోయింది, ఇంటికి బయలు దేరి వస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఎంతసేపటికి ఇంటికిరాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. విమాన ప్రమాదం జరిగిన రోజున ఆయన ఫోన్ సంఘటన స్థలికి 700 మీటర్ల దూరంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రమాదంలో ఆయన చనిపోయాడని గుర్తించడానికి మా కుటుంబ నుంచి 'డిఎన్ఏ' నమూనాలని సేకరించారు. ఎప్పుడు ఆ మార్గంలో రాడు. దురదృష్టవశాత్తు ఆ రోజు ఆ మార్గాన్ని ఎంచుకొని ఉంటాడని ఆమె చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 'లా గార్డెన్' కి సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది.
మహేష్ జీరావాలా 2019 లో గుజరాతి భాషలో తెరకెక్కిన 'కాక్ టెల్ ప్రేమి పాగ్ ఆఫ్ రివెంజ్' అనే చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కి కూడా దర్శకత్వం వహించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
