మహేశ్ కు అంత ధైర్యం ఏంటో...!
on Jan 28, 2017
సాధారణంగా తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం.. మన తెలుగు సినిమాలు తమిళంలో డబ్ అవ్వడం జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు అంతలా లేకపోయినా ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఒకే సినిమా.. ఒకే సారి రెండు బాషల్లో రిలీజ్ చేసేస్తున్నారు. మన టాలీవుడ్ టాప్ హీరోస్ కూడా తన మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు అందుకు సై అంటున్నారు. ఇతర భాషల్లో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ కలెక్షన్లను టార్గెట్ చేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. అయితే తాజాగా మహేశ్ తీసుకున్న నిర్ణయంపైనే కాస్త డౌట్ పడుతున్నారు అందరూ. అదేంటంటారా.. రాజకుమారుడు సినిమాను కోలీవుడ్ లో రిలీజ్ చేయడం.
అసలు సంగతేంటంటే మహేశ్ తీసిన సినిమాల్లో అతడు, దూకుడు, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు తమిళంలో రిలీజ్ అయి అక్కడ కూడా మంచి కలెక్షన్లే వచ్చాయి. అయితే ఇప్పుడు దాదాపు 18 ఏళ్ల తరువాత ఆయన నటించిన రాజకుమారుడు సినిమాని కోలీవుడ్లో రిలీజ్ చేశారు. దీంతో తొలి సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్కు అంగీకరించటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఈ సమయంలో మహేశ్ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోవడం సరైందికాదు అంటున్నారు. దీనికి కారణం.. రాజకుమారుడు సినిమాలో మహేష్ లుక్స్, నటన అంత మెచ్యూర్డ్గా కనిపించకపోవడమే. అందువల్ల సినిమా చూసిన ఆడియన్స్కు నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని అంటున్నారు. కానీ మహేశ్ మాత్రం అవేమి పట్టించుకోకుండా సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మహేశ్ ధైర్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆ సినిమా ప్రభావం అతనిపై పడుతుందో.. లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Also Read