మేజర్ అజయ్కృష్ణ కేరెక్టర్ను ఎంజాయ్ చేస్తున్న మహేశ్!
on Aug 6, 2019
'మహర్షి' మూవీతో తొలిసారి రూ. 100 కోట్ల (షేర్) క్లబ్బులో అడుగుపెట్టాడు మహేశ్. వరల్డ్వైడ్ టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్గా రికార్డుపుటల్లోకి ఎక్కింది. ఇప్పుడు తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సెట్స్పై బిజీ బిజీగా గడుపుతున్నాడు మహేశ్. ఈ ఏడాది తొలి బ్లాక్బస్టర్ 'ఎఫ్ 2'ను అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీని రూపొందిస్తున్నాడు. వరుసగా రెండు సీరియస్ మూవీస్ 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాలు చేసి విజయాలు సాధించిన మహేశ్.. 'సరిలేరు నీకెవ్వరు'లో ఎలా కనిపిస్తాడు? సినిమా ఎలా ఉంటుంది?.. అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ తయారవుతోంది. తాజా సంచలన తార రష్మికా మందన్న నాయికగా నటిస్తుండటం ఈ సినిమాకి ఇంకొంత ఆకర్షణ జోడించినట్లయింది. ఈ మూవీలో మహేశ్, రాజేంద్రప్రసాద్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయని తెలుస్తోంది. టాం అండ్ జెర్రీ తరహాలో ఆ ఇద్దరి కేరెక్టర్లను డైరెక్టర్ డిజైన్ చేశాడంటున్నారు. జగపతిబాబు స్థానంలో వచ్చిన ప్రకాశ్ రాజ్ కేరెక్టర్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. విజయశాంతి ఒక శక్తిమంతమైన కేరెక్టర్లో కనిపించనున్నారు.
'పటాస్'తో డైరెక్టర్గా పరిచయమైనప్పట్నుంచీ మహేశ్తో సినిమా చెయ్యాలని తపిస్తూ వచ్చిన అనిల్ రావిపూడి తక్కువ కాలంలోనే, తన ఐదో సినిమాలోనే మహేశ్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న అతను హిలేరియస్ ఎంటర్టైనర్గా 'సరిలేరు నీకెవ్వరు'ను తీర్చిదిద్దుతున్నాడు. సెట్స్పై మేజర్ అజయ్కృష్ణ పాత్రలో సీన్స్ చేస్తూ మహేశ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో తాను ఇలాంటి ఎంటర్టైనింగ్ రోల్ చెయ్యలేదని కూడా ఆయన తోటి నటులతో చెప్తున్నాడు. మొత్తానికి మహేశ్ దగ్గర డైరెక్టర్గా అనిల్ ఫుల్ మార్క్స్ కొట్టేశాడనేది యూనిట్ సభ్యుల మాట. 2019 సంక్రాంతిని అనిల్ ఎలాగైతే నవ్వులమయం చేశాడో, 2020 సంక్రాంతిని కూడా అలాగే చేసేట్లు కనిపిస్తోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..