మహేశ్, ఎన్టీఆర్లు లేకుంటే డీజే గతి అదోగతేనా..?
on Jun 27, 2017
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలున్నారు..ప్రతీ ఒక్కరికి వేరు వేరుగా అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి. తమ హీరో గొప్పంటే..తమ హీరో గొప్ప అని అభిమానులు కొట్టుకోవడం..చివరికి చంపుకున్న సంఘటనలు కూడా తెలుగునాట అనేకం ఉన్నాయి. మామూలుగా అయితే తమ ప్రత్యర్థి హీరో సినిమా రిలీజైతే అది ఫ్లాప్ కావాలని కోరుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించి పెద్ద మనసు చాటుకున్నారు ఎన్టీఆర్, మహేశ్ అభిమానులు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కుర్రాడిగా బన్నీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే అర్జున్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా డీజే నిలిచింది. మూడు రోజుల్లోనే రూ.65 కోట్లు అందుకుని..రూ.100కోట్ల మార్కును అందుకుంటుందని అంతా భావిస్తున్న టైంలో పైరసీ భూతం డీజేని పట్టుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డీజే మూవీని సోషల్ మీడియాలో పెట్టారు..విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ పైరసీ చేసిన వ్యక్తుల్ని పట్టుకునే పనిలో పడింది. అంతేకాకుండా పైరసీ సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా పిలుపునిచ్చింది. దీనిపై బన్నీ అభిమానుల కంటే వేగంగా స్పందించి పైరసీరాయుళ్ల ఆట కట్టించారు మహేశ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్. దీనిపై ఇద్దరు హీరోల అభిమానులకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు హరీశ్ శంకర్.
Also Read