మహేష్ గుమ్మడికాయ కొట్టేశాడు!
on Apr 18, 2019

హమ్మయ్య.... మహేష్ బాబు అభిమానులకు ఓ టెన్షన్ తగ్గింది. 'మహర్షి' సినిమా చిత్రీకరణ ముగిసింది. నిన్న అనగా... బుధవారం సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కుమార్తె సితార, చిత్ర బృందంతో కలిసి మహేష్ కేక్ కట్ చేశారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇక, 'మహర్షి' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే మిగిలున్నాయి. త్వరలో వాటిని పూర్తి చేసి మే 9న సినిమాను విడుదల చేయనున్నారు. నిజానికి, ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున విడుదల కావాలి. సకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావని... నిర్మాతలకు ముందుగానే అర్థం కావడంతో విడుదల వాయిదా వేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, అల్లరి నరేష్ హీరో స్నేహితుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా స్టిల్స్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే... దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు మాత్రం మెప్పించలేకపోయాయి. సినిమాలో లో విడుదలైన రెండు పాటలకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూడో పాట 'ఎవరెస్ట్ అంచున' శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది. అదెలా ఉంటుందో మరి??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



