అందంలో తల్లిని మించిపోతున్న మధుబాల కూతుళ్లు!
on Aug 2, 2021
మోహన్లాల్ సరసన 'యోధ', అరవింద్ స్వామి జోడీగా 'రోజా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మధుబాల, నేరుగా తెలుగులో నటించిన తొలి చిత్రం 'అల్లరి ప్రియుడు'. కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఆ మూవీలో రాజశేఖర్ సరసన రమ్యకృష్ణతో పాటు ఓ హీరోయిన్గా నటించి అలరించింది. ఆ సినిమా సూపర్ హిట్టయింది. ముఖ్యంగా మణిరత్నం 'రోజా' సినిమా ఆమెను దేశవ్యాప్తంగా సెన్సేషనల్ యాక్ట్రెస్ను చేసేసింది. ఫూల్ ఔర్ కాంటే, జెంటిల్మన్, జాలిమ్, గణేశ్, వానమే ఎల్లాయ్, ప్రేమ్ యోగ్ లాంది నార్త్, సౌత్ సినిమాల్లో హీరోయిన్గా ఆమె నటించింది.
పెళ్లి చేసుకొని చాలా కాలం సినిమాలకు దూరమైన ఆమె 'అంతకు ముందు ఆ తర్వాత' మూవీతో టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్తో 'కాలేజ్ కుమార్'లో నటించింది. త్వరలో 'తలైవి'లో ఎంజీఆర్ భార్య జానకిగా కనిపించనున్న ఆమె, గుణశేఖర్ పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లోనూ ఓ కీలక పాత్ర చేస్తోంది.
1990లో ఆనంద్ షా అనే బిజినెస్మేన్ను వివాహం చేసుకుంది మధుబాలు. వారికి ఇద్దరు కూతుళ్లు.. కియా షా, అమేయ షా. అందచందాల విషయంలో ఇద్దరూ తల్లిని తలదన్నేట్లు తయారయ్యారు. ఆ ఇద్దరికి సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడూ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తుంటుంది మధుబాల. ఇటీవల తన కూతుళ్ల ఫొటోను షేర్ చేసిన మధు, అబ్రాడ్లో ఉన్న అమేయను మిస్సవుతున్నానంటూ రాసుకొచ్చింది.
ఆ పోస్టుకు ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతూ త్వరలో ఇద్దరు హీరోయిన్లు మీ ఫ్యామిలీ నుంచి వస్తున్నట్లు కనిపిస్తోంది అని కామెంట్లు పెడుతున్నారు.
Also Read