బోర్ కొట్టేసిన పాపలు...టాప్ ప్లేస్ ఎవరిది..?
on Jan 24, 2016
సినిమా కథ ఎంత బాగున్నా, హీరోయిన్ లేకపోతే, సగటు తెలుగు ప్రేక్షకుడు సినిమాను ఏదో వెలితిగానే ఫీలవుతాడు.. అందుకే, తెలుగులో ఎంతటి ప్రయోగాత్మక సినిమాలొచ్చినా, వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో, అవసరం లేకపోయినా హీరోయిన్ పాత్రను సృష్టిస్తుంటారు మన దర్శక నిర్మాతలు..కానీ సమస్యేంటంటే, మన ప్రేక్షకులు ఒకే హీరోయిన్ ను కూడా ఎక్కువ కాలం చూడలేరు... ఒకప్పుడు మహానటి సావిత్రి లాంటి వాళ్లను ఎన్ని సంవత్సరాలైనా,కన్నార్పకుండా చూసేవారు.. కానీ అది గతం..ఇప్పుడు కథానాయికకు గట్టిగా చెప్పుకుంటే, ఆరేడేళ్లకు మించి స్పాన్ ఉండట్లేదు.
నిన్నటి తరంలో సిమ్రాన్,ఆర్తి అగర్వాల్ లాంటి వాళ్లు ఒక ఊపు ఊపారు.. వాళ్ల తర్వాత నయనతార,త్రిష,శ్రియ బ్యాచ్ కూడా బాగానే దశాబ్దం పాటు మ్యానేజ్ చేశారు..వీళ్లకూ ఏజ్ బారైపోవడంతో, తర్వాతి జనరేషన్ కాజల్,సమంత,అనుష్క,తమన్నాలు ఫామ్ లోకి వచ్చారు..ఇప్పుడు వీళ్ల జర్నీకూడా స్పీడ్ తగ్గింది.ప్రేక్షకుడు సరికొత్త అందాల్ని కోరుకుంటున్నాడు. రకుల్ ప్రీత్, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి లాంటి వాళ్లకు డిమాండ్ పెరగడం వెనుక కారణం అదే..మరి రాబోయే రెండు మూడేళ్లలో నెంబర్ గేమ్ లో టాప్ ప్లేస్ ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి..