సాధారణ ఉద్యోగినిగా కృతి శెట్టి!
on Nov 30, 2021
`ఉప్పెన`తో తెలుగు తెరపై మెరిసిన అందం కృతి శెట్టి. బేబమ్మగా కుర్రకారుని ఫిదా చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఈ క్రిస్మస్ కి `శ్యామ్ సింగ రాయ్`తో సందడి చేయనుంది. అలాగే `బంగార్రాజు`, `మాచర్ల నియోజక వర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ - లింగుస్వామి బైలింగ్వల్ మూవీతో వచ్చే సంవత్సరం వినోదాలు పంచేందుకు సిద్ధమైంది కృతి.
ఇదిలా ఉంటే.. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న `మాచర్ల నియోజక వర్గం`లో కృతి శెట్టి పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో కృతి ఓ సాధారణ ఉద్యోగిని పాత్రలో కనిపిస్తుందట. అంతేకాదు.. సెకండాఫ్ లో వచ్చే 10 నిమిషాల భారీ ఎపిసోడ్ లో తన నటన సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న `మాచర్ల నియోజక వర్గం`కి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్నారు. నితిన్ హోమ్ బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా ఏప్రిల్ 29న థియేటర్స్ లోకి రానుంది.
Also Read