'బాహుబలి 2'ను వెనక్కి నెట్టి నంబర్ 1 ప్లేస్కు దూసుకెళ్లిన 'కేజీఎఫ్ 2'
on May 28, 2022
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఏప్రిల్ 14న రిలీజైన దగ్గర్నుంచీ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులను బద్దలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. లేటెస్ట్గా ఈ మూవీ ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ ద్వారా అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డును సృష్టించడంతో పాటు, సరికొత్త బెంచ్మార్క్ను నిర్దేశించింది. కేజీఎఫ్ 2కి బుక్ మై షో ద్వారా 17.1 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇప్పటివరకూ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్న రాజమౌళి సినిమా 'బాహుబలి 2: ద కన్క్లూజన్' రెండో స్థానానికి వెళ్లిపోయింది.
కరోనా మహమ్మారి తర్వాత రిలీజైన ఓ సినిమా ఈ రేంజ్లో ఆడియెన్స్ను థియేటర్లకు రప్పించడం అసాధారణమైన విషయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మహమ్మారి కారణంగా ప్రేక్షకులు ఇళ్లలో ఉంటూ ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదిస్తున్న కాలంలో ఆడియెన్స్ను థియేటర్లకు రప్పిస్తూ, రికార్డులు సృష్టిస్తున్న సినిమాగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' సంచలనం కలిగించింది.
కాగా, 44 రోజులకు ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 1231.39 కోట్లను వసూలు చేసింది. 'కేజీఎఫ్' మూవీస్తో హీరో యశ్ అంటే తెలియని వాళ్లు లేరు అన్నంతగా కీర్తి సంపాదించుకుంటే, ప్రశాంత్ నీల్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకడిగా నిలిచాడు.
Also Read