మళ్లీ వివాదంలో కేజీయఫ్... క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి
on Mar 17, 2023
కేజీయఫ్ సినిమా విడుదలై సక్సెస్ అయి, వెయ్యి కోట్ల మార్కును కూడా దాటేసింది. ఫస్ట్ పార్ట్ కలిగించిన క్యూరియాసిటీతో సెకండ్ పార్ట్ సూపర్ సక్సెస్ అయింది. మూడో పార్టు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు జనాలు. తన తల్లి కోరిక మేరకు బంగారం మొత్తాన్ని తీసుకెళ్లిన రాకీభాయ్ ఏం చేశాడనేది ఇప్పుడు పార్ట్ త్రీలో చూడాల్సిన కథ. ఈ నేపథ్యంలోనే ఈమధ్య కాంట్రవర్శీ మాటలు వినిపించాయి. అసలు అలాంటి పిచ్చి కోరిక కోరిన తల్లిని ఏమనాలి? ఆమె పిచ్చి మాటలు పట్టుకుని సముద్రంలోకి ఉరికిన హీరో పిచ్చితనాన్ని ఏమనాలి అంటూ విమర్శలు గుప్పించారు యంగ్ ఫిల్మ్ మేకర్స్. అసలు ఆ తల్లి కోరికలోనే అర్థం పర్థం లేదంటూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు కేజీయఫ్ మేకర్ ప్రశాంత్ నీల్.
సినిమాకు సంబంధించి కథా పరమైన ఇలాంటి చర్చలన్నీ ఓ వైపు. తనతో పనిచేసిన హీరోయిన్ శ్రీనిధి శెట్టిని యష్ వేధించాడన్నది మరో వైపు. యష్ నిజంగానే శ్రీనిధిని వేధించాడా? అతను సెట్లో సుపీరియర్గా ప్రవర్తించాడా? శ్రీనిధికి ఏదో ఛాన్సు ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడా? యష్ యాటిట్యూడ్ అలాగే ఉండేదా? ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ చర్చ. కానీ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు శ్రీనిధి. యష్ తనకు మెంటర్ అని అన్నారు. కేజీయఫ్ సినిమా యూనిట్లోని ప్రతి ఒక్కరూ తనను చాలా బాగా చూసుకున్నారని అన్నారు. యష్కి తాను పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పారు. కేజీయఫ్2లో శ్రీనిధి చేసిన కేరక్టర్ చనిపోతుంది. పార్ట్ త్రీలో ఆమె రెఫరెన్స్ ఉంటే ఉండవచ్చేమోగానీ, ఆమె కేరక్టర్ కంటిన్యూ అయ్యే ప్రస్తకే లేదు. ఈ నేపథ్యంలో శ్రీనిధి చెప్పారంటూ నార్త్ లో వినిపిస్తున్న మాటల మీద ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.
Also Read