వేదిక వద్దకు పవన్..ఊగిపోయిన ఫ్యాన్స్
on Mar 18, 2017
పవన్కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్గా జరుగుతోంది. సాయంత్రం నుంచి పవన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు. అయితే రాత్రి 9 గంటలకు ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించి పవర్స్టార్ దర్శనం అయ్యింది. దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి పవన్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన అక్కడికి వచ్చారో లేదో అభిమానులు పూనకంతో ఊగిపోయారు. ఒక పది నిమిషాల పాటు ఆడిటోరియం మొత్తం జై పవన్ నినాదాలతో మారు మోగిపోయింది.