ENGLISH | TELUGU  

'కార్తికేయ-2' ట్రైలర్.. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు

on Jun 24, 2022

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' సినిమా 2014 అక్టోబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. యానిమల్ హిప్న‌టిజం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో 'కార్తికేయ-2' వస్తున్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

'కార్తికేయ-2' ట్రైలర్-1 ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'కార్తికేయ'ను మించి చాలా పెద్ద స్థాయిలో 'కార్తికేయ-2' ఉండనుందని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. 'కార్తికేయ' కథ ఒక గుడి నేపథ్యంలో జరగగా.. 'కార్తికేయ-2' కథ శ్రీకృష్ణుడి నేపథ్యంలో ఉండనుంది. "ప్రాణ త్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలవు" అంటూ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్ ని బట్టి చూస్తే.. ఏదో ఒక విలువైన దానిని వెతుక్కుంటూ ఓ వైపు హీరో, మరోవైపు విలన్ గ్యాంగ్ వెళ్లనున్నారని అనిపిస్తోంది. వాళ్ళ వెతుకులాట దేనికొరకు? అసలు ఈ కథకి, శ్రీకృష్ణుడికి సంబంధమేంటి? వంటి ప్రశ్నలతో సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది ట్రైలర్. ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. జూలై 22న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.