టాలీవుడ్పై కంగన సెన్సేషనల్ కామెంట్స్!
on Sep 20, 2020
సంచలనాత్మక ప్రకటనలకు, వ్యాఖ్యలకు పేరుపొందిన కంగనా రనౌత్.. చాలా సందర్భాల్లో ఎదుటివాళ్లను ఇరుకున పెడుతుంటుందని మనకు తెలుసు. కానీ, ఈ సారి తెలుగు చిత్రసీమను ప్రశంసించడం ద్వారా ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రకటనతో టాలీవుడ్ జనాలు మాత్రం సంబరపడుతున్నారు.
"ఇండియాలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ప్రజల సాధారణాభిప్రాయం తప్పు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అగ్ర స్థానానికి చేరుకుంది. ఇప్పుడు పలు భాషల్లో పాన్ ఇండియా సినిమాలను అందిస్తోంది. మరోవైపు అనేక హిందీ సినిమాలు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నాయి." అని ఆమె ట్వీట్ చేసింది.
అలాగే, ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక సంస్కరణలు తీసుకు రావాల్సి ఉందనీ, మొదట ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఒక పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ మనకు అవసరమనీ ఆమె చెప్పింది. ఎన్నో కారణాల వల్ల మనం విడిపోయి ఉన్నామనీ, అందువల్లే హాలీవుడ్ ఫిలిమ్స్ ప్రయోజనం పొందుతున్నాయనీ ఆమె అభిప్రాయపడింది. మొత్తానికి హిందీ కంటే తెలుగు చిత్రసీమదే అగ్రస్థానం అని కంగన పేర్కొనడంతో తెలుగు సినీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ప్రభాస్ జోడీగా 'ఏక్ నిరంజన్' అనే మూవీని కంగన చేసిన విషయం తెలిసిందే.
Also Read