ఎన్టీఆర్ ఆతిథ్యానికి ఫిదా అయిన సంజయ్ దత్...
on Oct 7, 2019
అతిదులకు ఆతిథ్యం ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీఎఫ్-టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరో యశ్ తో పాటు కీలక పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్ సైతం ఇందులో పాల్గొంటున్నారు. అయితే సంజయ్ దత్ ను మరియు కె.జి.ఎఫ్ హీరో యశ్ ను తన ఇంటికి భోజనానికి పిలిచారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన ఆతిథ్యానికి ఫిదా అయిన సంజయ్ దత్ ముంబయి వచ్చినప్పుడు తనింటికి తప్పనిసరిగా రావాలని ఎన్టీఆర్ ను ఆహ్వానించారట. ఆ మధ్య ట్రిపుల్ ఆర్ మూవీలో సంజయ్ దత్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తాడనే వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు సంజయ్ దత్ కు ఎన్టీఆర్ స్పెషల్ ట్రీట్ ఇవ్వడంతో అందులో వాస్తవం ఉందనిపిస్తోంది.
ఇదిలా ఉండగా గాంధీ జయంతిని పురస్కరించుకొని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, విజయ్ కుమార్ తన కార్యవర్గ సభ్యులతో కలిసి ఫిలింనగర్ లోని వీధుల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిలింనగర్ లోని ప్రాంతాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు సైతం నరేష్ బృందం కృతజ్ఞతలు తెలిపింది.