జనతా గ్యారేజ్కి మోహన్ లాల్ వార్నింగ్
on Aug 13, 2016
ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా చిత్రబృందం అంతా హాజరైంది. మోహన్లాల్, సమంత మాత్రం డుమ్మా కొట్టారు. ఒంట్లో బాగోలేదు అందుకే నేను రావడం లేదంటూ సమంత ట్వీట్ చేసింది. మోహన్ లాల్ గైర్హాజరు వెనుక మాత్రం ఓ కారణం ఉంది. అదేంటంటే... జనతా గ్యారేజ్ టీమ్ పై మోహన్ లాల్ అలిగాడట. అందుకే ఈ కార్యక్రమానికి రాలేదట.
వివరాల్లోకి వెళ్తే.. జనతా గ్యారేజ్ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్చెబుదామనుకొన్నాడు మోహన్ లాల్. దానికి మొదట్లో చిత్రబృందం కూడా సరే... అంది. అయితే మనమంతా సినిమాకీ మోహన్ లాల్ డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమాలో మాటలు కాస్త ముద్ద ముద్దగా వినిపించడంతో జనతా గ్యారేజ్ టీమ్ కంగారు పడింది. అందుకే ''ఈసారికి మరొకరితో డబ్బింగ్ చెప్పించుకొంటాం'' అని కోరింది. దాంతో మోహన్ లాల్ అలిగాడట. ''నా పాత్రకు నేను కాకుండా మరొకరు డబ్బింగ్ చెబితే నేను ప్రమోషన్లకు రాను'' అంటూ వార్నింగ్ ఇచ్చాడట. అందుకే మోహన్ లాల్ ఈ కార్యక్రమానికి రాలేదని తెలుస్తోంది. ట్రైలర్లో వినిపించింది కూడా మోహన్ లాల్ గొంతు కాదు. సో.. మోహన్ లాల్ అందుకే అలిగాడన్నమాట.