మహేశ్తో ఊరు..ఎన్టీఆర్తో మొక్క..!
on Aug 12, 2016
వరుస బ్లాక్బస్టర్లతో టాలీవుడ్ని షేక్ చేసి..హీరోల ఫస్ట్ ఛాయిస్గా మారిపోయాడు కొరటాల శివ. మిర్చితో ప్రభాస్కి, శ్రీమంతుడుతో మహేశ్ బాబుకి తిరుగులేని హిట్స్ ఇచ్చి ఇప్పుడు ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అసలు కథేంటి..? ఎన్టీఆర్ రోల్ ఎంటీ అనే విషయం ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రాకుండా కొరటాల జాగ్రత్తలు తీసుకురావడంతో అభిమానులకు స్టోరీ లైన్ తెలియక జుట్టు పీక్కున్నారు.
జనతా గ్యారేజ్ అని పేరు పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ మెకానిక్ అని..కాదు గ్యారేజ్లో విలన్ల బెండు తీస్తారని ఇష్టమొచ్చినట్టు ఊహించేసుకున్నారు. అయితే గ్యారేజ్ ఆడియో వేడుకలో రిలీజ్ చేసిన ట్రైలర్లో అసలు సంగతి తెలిసిపోయింది. శ్రీమంతుడిలో ఊరి దత్తత అనే కాన్సెప్ట్తో మహేశ్ చేత మేసేజ్ ఇప్పించిన కొరటాల. ఈ సినిమాలో "మొక్కలు -పర్యావరణం" అంటూ ఎన్టీఆర్తో మరో మేసేజ్ ఇప్పించాడు. ట్రైలర్లో ఎన్టీఆర్ ఎవరితోనే మొక్కల గురించి, ఆక్సిజన్ గురించి డైలాగ్స్ చెబుతుండటంతో ఇది కన్ఫార్మ్గా చెట్ల విలువను చెప్పే స్టోరీ అని అర్థమైపోతోంది. శ్రీమంతుడి స్పూర్తితో ఎంతోమంది ఊళ్లను దత్తత తీసుకున్నారు. మరి జనతా గ్యారేజ్ ఎలాంటి స్పూర్తినివ్వబోతోందో..?