పేపర్ బాయ్ దర్శకుడుతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్!
on May 10, 2024
జాక్వెలిన్ ఫెర్నాండేజ్..శ్రీలంక కి చెందిన ఈ ముద్దుగుమ్మ 2009 లో వచ్చిన అలాదిన్ తో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమాతోనే అమితాబ్ బచ్చన్ వంటి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత హౌస్ ఫుల్ పార్ట్ 1 ,పార్ట్ 2 , రామయ్య వస్తావయ్యా, రాయ్,కిక్ ఏ జెంటిల్ మాన్, రేస్ 2 , హౌస్ ఫుల్ త్రీ, సర్కస్, సెల్ఫీ ఇలా సుమారు ముప్పై కి పైగా చిత్రాల్లో నటించింది. తాజాగా ఒక కొత్త మూవీకి కమిట్ అయిందనే వార్తలు వస్తున్నాయి.
2018 లో సంతోష్ శోభన్ ,రియా సుమన్ లు జంటగా వచ్చిన మూవీ పేపర్ బాయ్. జయశంకర్ దర్శకుడు. ప్రెజంట్ అరి అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. జూన్ లో విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీని జాక్వెలిన్ తో చెయ్యబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ సబ్జట్ తో తెరకెక్కబోతున్న ఆ మూవీ కథ జాక్వెలిన్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. గతంలో నయనతార నటించబోతుందనే రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నయన్ ప్లేస్ లో జాక్వెలిన్ చేరిందనే మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ విషయం మీద ఎలాంటి అధికార ప్రకటన లేదు
ఇది ఎవరు ఊహించని ఒక వెరైటీ కాంబో అని చెప్పవచ్చు.పైగా నార్త్ లో జాక్వెలిన్ కి మార్కెట్ ఉంది కాబట్టి పాన్ ఇండియా మూవీగా కూడా మారవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ సాహో లో జాక్వెలిన్ ఒక ప్రత్యేక గీతంలో మెరిసి తెలుగు ప్రేక్షకులని తన అందంతో మెస్మరైజ్ చేసింది