ENGLISH | TELUGU  

'జాణవులే' సాంగ్ వచ్చేసింది 'బ్రో'.. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే..!

on Jul 15, 2023

'బ్రో' ఫస్ట్ సింగిల్ "మై డియర్ మార్కండేయ"కి మిశ్రమ స్పందన రావడంతో.. అందరి దృష్టి సెకండ్ సింగిల్ పై పడింది. "జాణవులే" అంటూ ప్రారంభమయ్యే ఈ డ్యూయెట్.. శనివారం యూట్యూబ్ ముంగిట నిలిచింది. సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మపై చిత్రీకరించిన ఈ గీతాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్, కె. ప్రణతి గానం చేయగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు. తమన్ మార్క్ మెలోడీగా "జాణవులే నెరజాణవులే.. నా జాను నువ్వులే.." అంటూ మొదలయ్యే ఈ పాట చివరలో.. "నా ఎదలో కథను మొదలు పెడితే మొదటి మాట నీదే.." వంటి వాక్యాలు బాగున్నాయి. ఇన్ స్టంట్ హిట్ నంబర్ అని చెప్పలేం గానీ.. మెలోడీ కాబట్టి వినగా వినగా కనెక్ట్ అయ్యే సాంగ్ అని చెప్పొచ్చు.

ఇక ఈ పాటపై నెటిజన్ల రియాక్షన్ మాత్రం ఎక్కువగా పాజిటివ్ గానే ఉంది. సాయి తేజ్, కేతికా శర్మ జంట బావుందని కొందరు.. తమన్ అన్న గొంతు సూపర్ అని మరికొందరు.. లొకేషన్స్ అదరహో అని ఇంకొందరు.. బిగ్ స్క్రీన్ పై ఈ పాట చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నామని కొంతమంది.. కామెంట్స్ చేశారు. మరి.. వెండితెరపై ఈ పాట ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే జూలై 28 వరకు వేచి చూడాల్సిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ లో నటించిన 'బ్రో'కి సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం.. సముద్రఖని తెరకెక్కించిన తమిళ సినిమా 'వినోదయ సితమ్'కి రీమేక్ వెర్షన్. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.