'జాణవులే' సాంగ్ వచ్చేసింది 'బ్రో'.. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే..!
on Jul 15, 2023
'బ్రో' ఫస్ట్ సింగిల్ "మై డియర్ మార్కండేయ"కి మిశ్రమ స్పందన రావడంతో.. అందరి దృష్టి సెకండ్ సింగిల్ పై పడింది. "జాణవులే" అంటూ ప్రారంభమయ్యే ఈ డ్యూయెట్.. శనివారం యూట్యూబ్ ముంగిట నిలిచింది. సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మపై చిత్రీకరించిన ఈ గీతాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్, కె. ప్రణతి గానం చేయగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు. తమన్ మార్క్ మెలోడీగా "జాణవులే నెరజాణవులే.. నా జాను నువ్వులే.." అంటూ మొదలయ్యే ఈ పాట చివరలో.. "నా ఎదలో కథను మొదలు పెడితే మొదటి మాట నీదే.." వంటి వాక్యాలు బాగున్నాయి. ఇన్ స్టంట్ హిట్ నంబర్ అని చెప్పలేం గానీ.. మెలోడీ కాబట్టి వినగా వినగా కనెక్ట్ అయ్యే సాంగ్ అని చెప్పొచ్చు.
ఇక ఈ పాటపై నెటిజన్ల రియాక్షన్ మాత్రం ఎక్కువగా పాజిటివ్ గానే ఉంది. సాయి తేజ్, కేతికా శర్మ జంట బావుందని కొందరు.. తమన్ అన్న గొంతు సూపర్ అని మరికొందరు.. లొకేషన్స్ అదరహో అని ఇంకొందరు.. బిగ్ స్క్రీన్ పై ఈ పాట చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నామని కొంతమంది.. కామెంట్స్ చేశారు. మరి.. వెండితెరపై ఈ పాట ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే జూలై 28 వరకు వేచి చూడాల్సిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ లో నటించిన 'బ్రో'కి సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం.. సముద్రఖని తెరకెక్కించిన తమిళ సినిమా 'వినోదయ సితమ్'కి రీమేక్ వెర్షన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
