ENGLISH | TELUGU  

డ్యూడ్ కి షాక్ ఇచ్చిన ఇళయరాజా 

on Oct 22, 2025

సంగీత ప్రపంచంలో 'ఇసైజ్ఞాని' గా పిలుచుకునే 'ఇళయరాజా'(Ilaiyaraaja)సంగీతానికి ఉన్నశక్తి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన స్వరపరిచిన పాట నిత్యం ఏదో ఒక చోట మారుమోగిపోతూనే ఉంటుంది. నేటికీ విడుదలవుతున్న చాలా కొత్త చిత్రాల్లో కూడా ఇళయరాజా పాటలని ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే  ఈ విషయంలో తన అనుమతి లేకుండా తన పాటలని ఉపయోగించుకుంటున్నారని ఇళయరాజా కోర్ట్ ద్వారా సదరు చిత్రాల మేకర్స్ కి నోటీసులు పంపిస్తునే ఉన్నాడు.


ఈ కోవలోనే ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతున్న డ్యూడ్ మూవీలో తన అనుమతి లేకుండా పాటలని ఉపయోగించుకున్నారని, కాబట్టి మేకర్స్ పై, సోనీ మ్యూజిక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతు ఇళయరాజా చెన్నై(chennai)హైకోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై కోర్టు స్పందిస్తు ఇళయరాజా న్యాయపరంగా ముందుకెళ్లడానికి  అనుమతి ఇచ్చింది. ఈ తీర్పుతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది

'డ్యూడ్' లో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan),మమిత బైజు(Mamitha Baiju)నటించగా ఈ నెల 17 న తమిళంతో పాటు తెలుగులోను భారీ థియేటర్స్ లో విడుదలైంది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.ప్రదీప్‌ రంగనాథన్‌, మమితా బైజు పెళ్లికి సంబంధించిన సీన్ వచ్చినప్పుడు 'పుదు నెల్లు పుధు నాతు(Pudhu nellu Pudhu Naathu)అనే తమిళ  చిత్రంలోని 'కరుతమచ్చన్'(Karutha Machan)అనే సాంగ్ ని ఉపయోగించడం జరిగింది. ఇళయరాజా సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ పాటని ఎస్ జానకి ఆలపించగా హీరోయిన్ సుకన్య పై చిత్రీకరించారు. ఇళయరాజానే సాహిత్యాన్ని అందించడం కూడా విశేషం. భారతి రాజా(BharathiRaja)దర్శకుడు కాగా 1991 లో విడుదలైంది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.