సుకుమార్, పూరి రూటులో హరీష్ శంకర్
on Jul 13, 2020
'కుమారి 21ఎఫ్' సినిమాకు కథ సుకుమార్దే. శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి, సినిమా ప్రొడ్యూస్ చేశాడు. శిష్యులకు డైరెక్షన్ ఛాన్సుల కోసం సుకుమార్ సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే, పూరి జగన్నాథ్ కూడా. తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన సినిమాలకు కథలు అందించాడు. లేటెస్టుగా కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' సినిమాకి కథ అందించారు పూరి. వీళ్లిద్దరి రూటులో హరీష్ శంకర్ వెళుతున్నారు.
ప్రస్తుతం ఓటీటీ కోసం సిరీస్లు, సినిమాలు తీసే దర్శకుల సంఖ్య పెరిగింది. చాలామంది దర్శకులు ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అయితే అర డజను సినిమాలు అనౌన్స్ చేశారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో మినీ, ఫీచర్ మూవీస్ తీస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ సైతం కరోనా నేపథ్యంలో స్టోరీకి ఒక ఐడియా అనుకున్నారు. అయితే, ఆయన కథ రాయడం లేదు. వేరొకరికి ఐడియా చెప్పి కథ రాయిస్తున్నారు. ఆ ఐడియాతో చేయబోయే సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఛాన్స్ ఉందట.