ENGLISH | TELUGU  

హేమలతరెడ్డికి గ్లామన్‌ మిసెస్‌ ఇండియా 2024 అవార్డు.. హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్‌!

on Sep 30, 2024

జెమినీ టీవీ యాంకర్‌గా, ‘నిన్ను చూస్తూ’ సినిమాలో హీరోయిన్‌గా హేమలతరెడ్డి ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె గ్లామన్‌ మిసెస్‌ ఇండియా 2024 అవార్డు, బెస్ట్‌ టాలెంట్‌ మరియు బెస్ట్‌ ఫోటోజెనిక్‌ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు. కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో అంతర్జాతీయ షూట్‌ చేసారు. గ్లామన్‌ డైరెక్టర్‌ శ్రీమతి మన్‌దువా కూడా అక్కడ ఉత్సాహంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. తర్వాత హేమలతరెడ్డి.. మన్‌దువాతో కలిసి బటుకేశవరా ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల 28న హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తర్వాత గచ్చిబౌలిలోని డెక్కన్‌ సరై గ్రాండ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు..

ఈ సందర్భంగా హీరోయిన్‌ హేమలతరెడ్డి మాట్లాడుతూ ‘నేను ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నాను. జెమిని టివిలో యాంకర్‌గా మొదలుపెట్టి సీరియల్స్‌ చేశాను, ఆ తరువాత ప్రొడక్షన్‌ మీద ఇంట్రెస్ట్‌తో ప్రొడ్యూసర్‌ కావాలి అనుకుని ఒక సినిమా తీశాను. ఆ తర్వాత కోవిడ్‌ టైంలో ఫ్యాషన్‌ సైడ్‌ ట్రై చేశాను. సెలెక్ట్‌ అయ్యి రౌండ్స్‌ అన్నీ వర్చువల్‌గా కంప్లీట్‌ చేశాను. ఫైనల్‌ సెలక్షన్స్‌కి మలేషియా వెళ్లాను. అక్కడ కాంపిటీషన్‌ చాల టఫ్‌గా నడిచింది. దక్షిణాది నుండి నేను మాత్రమే వెళ్లగలిగాను. చివరిగా గెలిచాను. మన మాతృ భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నేను గెలుస్తాను అని అనుకోలేదు. అక్కడ నార్త్‌, సౌత్‌ అనే పార్షియలిటీ లేదు. అటు నటన, అలాగే ఇటు గ్లామర్‌ రెండూ కష్టమైన పనులే. నేను ప్రొడ్యూసర్‌గా హీరోయిన్‌గా చేసిన సినిమా ‘నిన్ను చూస్తూ’. ఆ సినిమాలో సుహాసినిగారు, సుమన్‌గారు, షాయాజి షిండే వంటి సీనియర్‌ నటులతో నటించాను. వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా సుహాసినిగారు ఎన్నో మంచి టిప్స్‌ ఇచ్చారు. ఆవిడ నాకు ఇన్‌స్పిరేషన్‌. అలాగే నాకు మా కుటుంబం నుండి మంచి సపోర్ట్‌, ముఖ్యంగా మా నాన్న నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ఎన్‌ టివి, టివి9లో కూడా నేను పని చేశాను. ఆడవారు గ్లామర్‌గా మాత్రమే కాదు, ప్రతి రంగంలో ముందుండాలి. ఆఫర్‌ వాస్తే ఎలాంటి రోల్స్‌ అయిన చేస్తాను. నా సినిమాని మీడియా చాలా సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు నా కెరియర్‌ని నేను ఫ్యూచర్‌లో చేసే రోల్స్‌, సినిమాలను కూడా సపోర్ట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

గ్లామన్‌ డైరెక్టర్‌ శ్రీమతి మన్‌ దువా మాట్లాడుతూ ‘గ్లామన్‌ మిస్‌ అండ్‌ మిసెస్‌ ఇండియా పోటీని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. 39 సిటీలలో 60 మంది కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్‌ చేసాం. 35 మందిని మలేషియా తీసుకెళ్లాం. టైటిల్‌ విన్నర్‌గా మీ హైదరాబాద్‌ అమ్మాయి హేమలతరెడ్డి గెలిచారు. చాలా టఫ్‌ కాంపిటీషన్‌ నడిచింది విన్నర్‌ని సెలెక్ట్‌ చేయడం చాలా కష్టమైంది. ఇక ఇప్పుడు గ్లామన్‌ మిస్‌ అండ్‌ మిస్సెస్‌ వరల్డ్‌ కాంపిటీషన్‌ చేస్తున్నాం. 149 దేశాల నుంచి ఎంట్రీస్‌ని తీసుకుంటున్నాం. ఆ ఫినాలేని ప్యారిస్‌లో ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు. అంతేకాక ఈ గ్లామన్‌ అవార్డు గెలుచుకున్న హేమలతరెడ్డిగారిని త్వరలోనే పారిస్‌కు తీసుకొని వెళ్ళబోతున్నాం’ అన్నారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.