శివాత్మిక రాజశేఖర్: నాన్న ఆరోగ్యం క్షీణించలేదు.. స్థిరంగా ఉంది!
on Oct 22, 2020
సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా మారినట్లు ఆయన కుమార్తె శివాత్మిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా గురువారం ఉదయం షేర్ చేసిన నోట్తో అందరూ అభిప్రాయపడ్డారు. దాంతో ఆమె ట్వీట్కు స్పందనలు వెల్లువెత్తాయి. వెంటనే పరిస్థితిని గ్రహించిన శివాత్మిక కొద్దిసేపటికే మరో ట్వీట్ చేస్తూ, నాన్న ఆరోగ్య స్థితి క్లిష్టంగా లేదనీ, స్థిరంగా ఉందనీ, మెరుగువుతోందనీ చెప్పింది. మీరు చూపిన లవ్, విషెస్కు నేను థాంక్స్ చెప్పలేను! కానీ దయచేసి తెలుసుకోండి, ఆయన క్రిటికల్గా లేరు.. ఆయన స్థితి స్థిరంగా, మెరుగవుతోంది. మాకు కేవలం మీ ప్రార్థనలు, పాజిటివిటీ కావాలి. పానిక్ కాకండి. దయచేసి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకండి అని విజ్ఞప్తి చేసింది.
అంతకు ముందు ఆమె, "కొవిడ్తో నాన్న గట్టిగా పోరాడుతున్నప్పటికీ, ఆ పోరాటం క్లిష్టంగా మారింది. మీ ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలే మమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయనీ, మమ్మల్ని ముందుకు వెళ్లేలా చేస్తాయని మేం నమ్ముతున్నాం. నాన్న వేగిరంగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా మీ అందరినీ అడుగుతున్నాను. మీ ప్రేమతో ఆయన దీన్నుంచి దృఢంగా బయటకు వస్తారు" అని షేర్ చేసింది.
ఆమె ట్వీట్తో రాజశేఖర్ అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాము కొవిడ్-19 ఇన్ఫెక్షన్కు గురైనట్లుగా రాజశేఖర్ ఈ నెల 17న వెల్లడించారు. తమ కుటుంబం మొత్తానికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందనీ, అయితే తమ పిల్లలు ఇప్పటికే దాన్నుంచి పూర్తిగా బయటపడ్డారని తెలిపిన ఆయన, భార్య జీవిత, తను హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే దీన్నుంచి బయటపడి ఇంటికి వస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Also Read