రాధిక శ్రీలంకలో ఎందుకు చదువుకున్నారు?
on May 14, 2021
నిన్నటి తరం అగ్రశ్రేణి తారల్లో రాధిక ఒకరు. తెలుగు, తమిళ భాషలు రెండింటిలోనూ ఆమె సమానంగా రాణించారు. ఆమె తండ్రి ఎం.ఆర్. రాధ ప్రఖ్యాత తమిళ నటుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. పెరియార్తో కలిసి ద్రవిడ ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఆయన కూడా ఉన్నారు. రాధిక తల్లి గీత శ్రీలంక వనిత. రాధిక చెన్నైలోనే పుట్టి పెరిగి, చదువుకున్నారు. అయితే తండ్రికి రాజకీయపరంగా ఎంజీ రామచంద్రన్తో సమస్యలు తలెత్తడంతో రాధిక చదువు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతో తల్లి ఆమెను శ్రీలంకకు తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రాధిక తెలియజేశారు. "నేను ఇక్కడే (మద్రాస్లో) చదువుకున్నాను. అప్పుడు ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లెమ్స్ రావడం, ఎంజీఆర్తో రాజకీయపరంగా నాన్నగారికి డిస్టర్బెన్సెస్ తలెత్తడంతో మా అమ్మ నన్ను శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో చేర్పించారు. దాంతో నా చదువులో మేజర్ పోర్షన్ శ్రీలంకలోనే సాగింది. ఆ తర్వాత లండన్ వెళ్లాను. అక్కడ్నుంచి తిరిగి ఇండియాకు వచ్చాను." అని తన చదువు విషయం చెప్పారు రాధిక.
అప్పటి సమస్యల్లో తమ తల్లే ధైర్యంగా ఉండి ఇంటిని నడిపించుకొచ్చారని ఆమె వెల్లడించారు. మా ఇంట్లో అందరికంటే అమ్మ శక్తిమంతురాలు. నాన్నగారి కంటే కూడా ఆమె స్ట్రాంగ్. ఆమె చాలా ప్రాక్టికల్. ఆమె అప్పటి క్షణంలోనే జీవిస్తుండేవారు. ఆ క్షణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని చూసేవారు. పిల్లలెవరూ సినిమాల్లోకి వెళ్లకూడదని ఆమె భావించారు. నేను చిన్నప్పట్నుంచే హాస్టల్లో ఉన్నాను. సినిమా వాతావరణానికి దూరంగా ఉంచాలనే అమ్మ అలా చేశారు." అని రాధిక తెలిపారు.
Also Read