సారీ చెప్తారా.. 10 కోట్లు కడతారా?
on May 22, 2022
కోలీవుడ్ స్టార్ ధనుష్ తమ కుమారుడు అంటూ మధురైకి చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పటికే కోర్టుకి కూడా చేరింది. అయితే తాజాగా ధనుష్.. ఇప్పటికైనా ఆ ఆరోపణలు ఆపి, క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఆ దంపతులకు నోటిసులు పంపాడు.
ధనుష్ తమ కుమారుడని, సినిమాల్లో నటించాలన్న ఉద్దేశంతో చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయాడని కతిరేసన్, మీనాక్షి దంపతులు నాలుగేళ్ళుగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు ప్రతినెలా రూ.65 వేల పరిహారం చెల్లించాలని కూడా కోరారు. అయితే ఆ ఆరోపణలు ఖండించిన ధనుష్.. డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడిని అంటూ గతంలో కోర్టుకి ధృవీకరణ పత్రాలు కూడా సంపర్పించాడు. అయినప్పటికీ వివాదం సద్దుమణగకపోవడంతో తాజాగా ధనుష్, తన తండ్రి కస్తూరి రాజాతో కలిసి ఆ దంపతులకు లీగల్ నోటీసులు పంపించాడు.
తన గౌరవానికి ఇబ్బంది కలిగించేలా చేస్తున్న ఆరోపణలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని నోటీసుల్లో కోరాడు. ఈ ఆరోపణలు అవాస్తవాలని ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పాలని, 10 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ధనుష్ పంపిన ఈ లీగల్ నోటీసులపై ఆ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.