గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అలీ
on Aug 1, 2020

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సారథ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని సినీ కమెడియన్ అలీ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ హైదరాబాద్లోని మణికొండలో తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
ఎం.పి సంతోష్ కుమార్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుండటం ఎంతైనా ముదావహమని ఆయన అన్నారు. అనంతరం తన తమ్ముడు ఖయ్యూమ్, బావమరది కరీంలకు గ్రీన్ ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.


Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



