నిఖిల్తో మూడోసారి చేయలేనంది..!
on Nov 22, 2016
అందమైన చిరునవ్వు..అమాయకపు మాటలతో బుల్లితెరను షేక్ చేసింది కలర్స్ స్వాతి. ఆ షో తెచ్చిపెట్టిన పాపులారిటీతో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. అయితే హీరోయిన్గా ఆమె కెరిర్ మిశ్రమ ఫలితాలనే సాధించింది. ఒకటి, రెండు హిట్లు తప్పించి బ్లాక్ బస్టర్లేవి లేవు. పైగా స్వామిరారా వంటి హిట్ తర్వాత స్వాతి లీడ్ రోల్లో నటించిన త్రిపుర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో అవకాశాలు అందలేదు సరికదా..? ఉన్ప పేరు కూడా పోయింది. ఇక చేసిది లేక అప్పటి నుంచి ఖాళీగా ఉంటోంది స్వాతి. అయితే చీకటిలో చిరు దీపంలా రాక రాక ఓ ఆఫర్ వెతుక్కుంటూ వస్తే దాన్ని కూడా వద్దనేసిందట ఈ అమ్మడు. అదే సినిమానో కాదు..రీసెంట్గా విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న "ఎక్కడకు పోతావు చిన్నవాడా".
సినిమాను మలుపుతిప్పే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అమల పాత్ర కోసం దర్శకనిర్మాతలు ముందుగా స్వాతినే సంప్రదించారట. అప్పటికే స్వామిరారా, కార్తీకేయ వంటి సినిమాలతో నిఖిల్-స్వాతి హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్వాతికే ఇచ్చారు. కాని అది గెస్ట్ రోల్లా ఉందని, నిడివి తక్కువుందని ఆ ఆఫర్ను తిరస్కరించిందట స్వాతి. దీంతో ఆ పాత్ర అవికా గోర్ చేసింది. ఆ క్యారెక్టర్ స్టామినా ఎంటో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. సో బంగారం లాంటి ఛాన్స్ని మిస్ చేసుకుని ఇప్పుడు దేవుడా..? అంటోందట స్వాతి.