చిన్మయి.. ఆ ఇద్దరు గోల్డ్ అంటోంది
on Dec 8, 2021
సింగర్ చిన్మయి సింగర్గా ఎంత పాపులర్ అయిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో చేసే కామెంట్ల ద్వారా మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్గా వుంటూ అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తోంది. గతంలో తమిళ గేయ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన చిన్మయి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. సామాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులు, మహిళలపై జరుగుతున్న దాడులు.. అమ్మాయిల వివాహం.. కట్నం వంటి అంశాలపై ఘూటుగా స్పందించింది.
ఇక తాజాగా అమ్మాయిల వివాహంపై చిన్మయి చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అమ్మాయికి నచ్చకపోయినా కులం వాడు అయితే వాడు వెధవ అయినా సరే ఇచ్చి వివాహం చేసేస్తారని... మహిళల అభిప్రాయాలకి గౌరవం ఇవ్వరని, ఆర్థికంగా, స్వేచ్ఛగా బ్రతనివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేసింది. ఎన్నారై సంబంధాలు అంటూ వారికి కోట్లు కోట్లు కట్నాలు ఇస్తున్నారని చిన్మయి చేసి ఆరోపణలపై కొంత మంది నెటిజన్స్ స్పందించారు. కొంత మంది ట్రోల్ చేశారు కూడా.
ఈ విషయంపై తనని ట్రోల్ చేసిన వారికి అదే స్థాయిలో చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. ఇదిలా వుంటే చిన్మయికి మద్దతుగా ఇద్దరు ఎన్నారైలు ముందుకొచ్చారు. చిన్మయికి మెసేజ్లు కూడా పెట్టారట. వాటిని చిన్మయి తాజాగా బయటపెట్టింది. ఆ మెసేజ్లని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మెసేజ్లు చూశాక `నిజమైన మనుషులకు మగవారికి నా పోస్టులతో ఎలాంటి బాధ.. ఇబ్బంది లేదు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ అమ్మాయి నో చెబితే తట్టుకోలేని వాళ్లు.. వాళ్ల ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడేవాళ్లు ఇలా చేస్తారు. తనకు మద్ధతుగా నిలిచిన వారు గోల్డ్` అంటూ చిన్మయి కామెంట్ చేయడం విశేషం.
Also Read