విజయ్ ఇంట్లో బాంబు.. మొదలైన పోలీసుల వేట!
on Oct 9, 2025
దళపతి విజయ్కి తమిళనాట ఎంత ఫాలోయింగ్ వుందో అందరికీ తెలిసిందే. రజినీకాంత్ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించారు విజయ్. ‘తమిళగ వెట్రి కళగం’(టివికె) పేరుతో ఓ పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి వెళ్లి వారిని కలుసుకునేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు విజయ్. సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన ఈ ర్యాలీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. కరూర్ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు చాలా మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా మథియాళన్, కార్యకర్త పౌన్రాజ్, యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కరూర్ ఘటనపై పలువురు తమ నిరసనను వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నేతలు కూడా జరిగిన ఘటనపై వ్యాఖ్యానాలు చేశారు. ఇదిలా ఉంటే.. విజయ్కి బాంబు బెదిరింపులు వచ్చాయి. డయల్ 100కి కాల్ చేసిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ‘మరోసారి విజయ్ పబ్లిక్ మీటింగ్ పెడితే.. వాళ్ళ ఇంట్లో బాంబు పెడతాను’ అని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చెన్నయ్లోని విజయ్ ఇంటి దగ్గర భద్రత మరింత పెంచారు. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి అతని లొకేషన్ను ట్రేస్ చేస్తున్నారు. 100కి వచ్చిన ఈ కాల్ గురించి తెలుసుకొని విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



