ENGLISH | TELUGU  

ఒకే తేదీకి రెండు సీక్వెల్స్.. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్!

on Sep 11, 2023

2024 ఆగస్టు 15 కి రెండు బిగ్గెస్ట్ సీక్వెల్స్ బాక్సాఫీస్ బరిలో దిగనున్నాయి. అందులో ఒకటి 'పుష్ప: ది రూల్'(పుష్ప-2) కాగా, మరొకటి 'ఇండియన్-2'. ఇప్పటికే 'పుష్ప-2' రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగా.. 'ఇండియన్-2' విడుదల తేదీపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. 'పుష్ప-1'కి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు గెలుచుకోవడంతో.. ప్రేక్షకుల్లో 'పుష్ప-2'పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఈ చిత్రాన్ని 2024 ఆగస్టు 15 కి విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే అదేరోజు మరో భారీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

కమల్ హసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా 'ఇండియన్'(భారతీయుడు). 1996 మేలో విడుదలైన ఈ సినిమా తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకి విశేష ఆదరణ లభించింది. అలాంటి సంచలన సినిమాకి ఏకంగా 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ వస్తోంది. అదే 'ఇండియన్-2'. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2024 ఆగస్టు 15 కి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే తేదీపై 'పుష్ప-2' కర్చీఫ్ వేసింది. మరి 'ఇండియన్-2' కూడా అదే తేదీకి రావాలని ఫిక్స్ అయితే మాత్రం బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ ని చూడబోతున్నాం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.