ENGLISH | TELUGU  

నా మాటలు నొప్పిస్తే మన్నించండి అంటున్న బాలయ్య

on Mar 8, 2016

నారా రోహిత్ సావిత్రి ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. " మా ఫ్యాన్స్ హీరోయిన్ల వెనకాల పడితే ఒప్పుకోరు. ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి " అంటూ బాలయ్య సరదాగా వ్యాఖ్యానించారు. కానీ ఈ మాటలు వివాదాలకు దారి తీశాయి. బాలకృష్ణ మహిళలను కించపరిచారంటూ, చాలా మంది పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం వరకూ వెళ్లారు. తన వ్యాఖ్యలు దుమారం రేపుతుండటం, పైపెచ్చు ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో బాలకృష్ణ ఈ విషయంపై స్పందించారు.

తన వ్యాఖ్యలు సరదాగా అన్నవే కానీ, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పారు. " మహిళలంటే నాకు గౌరవం. నా సినిమాల్లో కూడా మహిళల గౌరవానికే పెద్దపీట ఉంటుంది. స్త్రీలను తోబుట్టువులుగా, మా ఆడపడుచులుగా చూడటం మాకు అలవాటు. నా సినిమాల గురించి చెబుతూ చేసిన ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించనవి కాదు. ఒక వేళ అలా ఎవరైనా నొచ్చుకుని ఉన్నట్లైతే, క్షమాపణ కోరుతున్నాను " అంటూ బాలయ్య మన్నింపు కోరారు. ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం విశేషం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.