స్క్రీన్ రైటర్లకు 'బాహుబలి' నిర్మాత పిలుపు
on Sep 23, 2020
వర్ధమాన సినీ రచయితలకు ఇదొక సదావకాశం. ముఖ్యంగా దేశం గర్వించదగ్గ సినిమా 'బాహుబలి' నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్లో పని చేయాలని కోరుకుంటున్న వారికి! కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నట్టు ఆ సంస్థ అధినేతలలో ఒకరైన శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. అయితే, ఆయన ఒక కండిషన్ పెట్టారు. పేరున్న ఫిల్మ్ స్కూల్ లో స్క్రిప్ట్ రైటింగ్ ప్రోగ్రామ్ చేసి ఉండాలని పేర్కొన్నారు.
"మేము బడ్డింగ్ స్క్రీన్ రైటర్లను మా సంస్థల్లోకి తీసుకుంటున్నాం. బాగా చదువుకుని ఉండి, పేరున్న ఫిల్మ్ స్కూల్లో స్క్రిప్ట్ రైటింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసి, సినిమా ప్రపంచంలోకి ప్రవేశించాలని చూస్తుననా వాళ్ళ కోసం చూస్తున్నాం. మీకు ఆసక్తి ఉన్నట్లయితే... ఈ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేయండి. మేము త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం" అని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.
'బాహుబలి' తరవాత ఆర్కా మీడియా వర్క్స్ నుంచి మరో భారీ సినిమా రాలేదు. కానీ, ఇటీవల ఓటీటీలో విడుదలైన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'ను విజయప్రవీణ పరుచూరితో కలిసి నిర్మించారు. కొత్త సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. వాటి కోసం స్క్రీన్ రైటర్లను తీసుకుంటున్నట్టు ఉన్నారు.
Also Read