బాహుబలి-2: ఏనుగుని ఓడించిన ప్రభాస్
on Feb 24, 2017
బాహుబలి-2 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో దర్శకధీరుడు రాజమౌళి పబ్లిసిటి స్టార్ట్ చేసేశాడు. మహాశివరాత్రి సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమానికి చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా భాహుబలి-2 మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఏనుగును ఓడించిన ప్రభాస్ దానిని అధిరోహిస్తున్నట్లుగా ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్ ద్వారా పోస్టర్ను రిలీజ్ చేసిన రాజమౌళి..సాహోరే బాహుబలి..మహాశివరాత్రి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇంతకు ముందు ప్రభాస్, అనుష్క విల్లు, బాణాలు ఎక్కుపెట్టినట్లుగా ఉన్న పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు.