డబ్బులు వచ్చాయి... పేరు పోయింది!
on Nov 6, 2019
‘మీకు మాత్రమే చెప్తా’తో రౌడీబాయ్, సెన్సెషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారాడు. పేరుకు మాత్రమే అతడు నిర్మాత... పనులన్నీ చక్కబెట్టింది తండ్రి గోవర్ధన్ దేవరకొండ. రౌడీబాయ్ నోటి వెంట ఈ మాట వచ్చింది కూడా! తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయమైన ఈ సినిమా విడుదలైంది. ఆల్మోస్ట్ మెజార్టీ థియేటర్లలోంచి వెళ్లడానికి రెడీగా ఉంది. సినిమాలో కొన్ని నవ్వులు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఇంకొందరు షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ను ఫీచర్ ఫిల్మ్గా తీశారని చెబుతున్నారు. ఏది ఏమైనా సినిమాకు డబ్బులు వచ్చాయి. మొత్తం లెక్కలు వేసుకుంటే, నిర్మాతకు లాభమే. కానీ, ఏం ప్రయోజనం? పేరు పోయింది. అవును... నిర్మాతగా విజయ్ దేవరకొండకు ‘మీకు మాత్రమే చెప్తా’ చెడ్డ పేరు తీసుకొచ్చింది. అతడికి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవాడానికి సినిమాను చుట్టేశాడని రౌడీబాయ్ అభిమానులు కూడా అంటున్నారంటే... సినిమా ప్రొడక్షన్ వేల్యూస్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకొవచ్చు. ఈ సినిమా వరకూ విజయ్ క్రేజ్కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. భవిష్యత్లో నిర్మాతగా ఇటువంటి సినిమా ఇంకొకటి చేస్తే చాలు... అతడి ప్రొడక్షన్ నుండి వచ్చే సినిమాలను లెక్క చేయరు. వెబ్ సిరీస్లు, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ క్వాలిటీతో ఉంటున్నప్పుడు, ఫీచర్ ఫిల్మ్స్ను మినిమమ్ క్వాలిటీతో తీయాలి కదా!