అనుష్క షేపులు మారిపోయాయి!!
on Nov 20, 2019
'సైజ్ జీరో' సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క.. ఆ తర్వాత బరువు తగ్గడానికి నానా తిప్పలూ పడుతూ వచ్చింది. ఆమె వల్లే 'బాహుబలి 2' షూటింగ్ ఆలస్యమయ్యిందన్న ప్రచారమూ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అయిన 'సైజ్ జీరో' సినిమా తనకు నటిగా మంచి పేరు తెస్తుందనే ఉద్దేశంతో, ఆ మూవీ డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి సూచన మేరకు బాగా లావయ్యింది. ఒక స్థూలకాయురాలైన అమ్మాయి జీవిత ప్రయాణం నేపథ్యంలో తీసిన ఆ సినిమా అనుష్క ఆశించిన దానికి భిన్నంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అనుష్క కెరీర్కీ ఆ సినిమా ఏమాత్రం ఉపయోగపడలేదు.
ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక, 'బాహుబలి 2' షూటింగ్కు వచ్చిన ఆమెను చూసి రాజమౌళి తీవ్రంగా అసంతృప్తి చెందాడు. యువరాణి దేవసేన పాత్రకు కావాల్సిన రూప లావణ్యాలు అనుష్కలో కనిపించలేదు. కారణం.. ఆమె ఇంకా భారీ పర్సనాలిటీతోనే ఉండటం. రాజమౌళి గట్టిగా చెప్పడంతో బరువు తగ్గే ప్రయత్నం చేసింది అనుష్క. అయినా 'బాహుబలి'లో కనిపించిన దానితో పోలిస్తే, 'బాహుబలి 2'లోని చాలా సన్నివేశాల్లో అనుష్క లావుగా కనిపించడాన్ని మనం గమనించవచ్చు. 'సైజ్ జీరో' తర్వాత ఆమె 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి', 'ఓం నమో వెంకటేశాయ' సినిమాల్లోనూ స్థూలకాయంతో కనిపించింది.
సహజంగా యోగా ప్రాక్టీస్ చేసే అనుష్క బరువు తగ్గే విషయంలో చాలా ఆలస్యం చేసిందని చెప్పాలి. 'భాగమతి'లోనూ, 'సైరా.. నరసింహారెడ్డి'లోనూ మునుపటంత స్లింగా కాకపోయినా బరువు తగ్గి కనిపించింది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, ఇంగ్లీషు భాషల్లో తయారవుతున్న 'నిశ్శబ్దం' సినిమాలో హీరోయిన్గా కనిపించబోతోంది. అందులో మాధవన్ జోడీగా ఒక మూగ చిత్రకారిణి అయిన సాక్షి అనే క్యారెక్టర్ చేసింది అనుష్క. 'బాహుబలి'కి ముందు చీరకట్టులో ఎంత బాగా కనిపిస్తూ వచ్చిందో, వెస్టరన్ డ్రస్సుల్లోనూ అంతలా మెప్పించింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వెస్టరన్ ఔట్ఫిట్లో ఆమె ఎంత బాగా ఉన్నదో తెలియజేసే ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అనుష్క.. లో-వెయిస్ట్ జీన్స్లో ఉన్న ఆ ఫొటోలు ఫ్యాన్స్ మతులు పోగొడుతున్నాయి. పింక్ కలర్ జీన్స్లో ఉన్న ఆ ఫొటోల్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రిట్వీట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆ ఫొటోల్లో ఒకటి బ్యాక్ వ్యూ అయితే, ఇంకొకటి ఫ్రంట్ వ్యూ. ఆ ఫొటోల్లో అనుష్కను చూసిన వాళ్ల కళ్లు పెద్దవి కావడం ఖాయం.
తెలుగువాళ్లకు, తమిళులకు ఆరాధ్య తార అయిన అనుష్క 'బాహుబలి' సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. దేవసేన పాత్రలో అమోఘంగా రాణించి, ప్రభాస్కు సరైన జోడీగా నీరాజనాలు అందుకుంది. అంతకు ముందు కూడా ప్రభాస్ సరసన ఆమె 'మిర్చి', 'బిల్లా' సినిమాల్లో నటించింది. 'బాహుబలి: ద బిగినింగ్'లో నటించేప్పుడే ఆ ఇద్దరి మధ్యా ప్రేమానుబంధం ఉందంటూ బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే తమ మధ్య స్నేహబంధం ఉంది కానీ, ప్రేమబంధం లేదని ఇద్దరూ చెబుతూ వచ్చారు. అయినా వాళ్లపై వదంతులకు ఫుల్స్టాప్ పడలేదు. త్వరలో ఆ ఇద్దరూ పెళ్లాడబోతున్నారని కూడా విరివిగా ప్రచారంలోకి రావడంతో, తమ ఇద్దరిలో ఏవరో ఒకరికి పెళ్లయితే కానీ ఈ వదంతులు ఆగవేమోనని ప్రభాస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయినా కూడా ప్రయోజనం కలగలేదు. నలభై యేళ్లయినా ప్రభాస్ కానీ, 38 ఏళ్ల వయసులో ఉన్న అనుష్క కానీ ఇంతదాకా పెళ్లాడలేదు. అందువల్లే వాళ్ల ఇద్దరి అనుబంధం గురించిన ప్రచారం కంటిన్యూ అవుతూ వస్తోంది.
అనుష్క కెరీర్ విషయానికి వస్తే.. 'నిశ్శబ్దం' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. లేటెస్టుగా 'అసురన్' రీమేక్లో వెంకటేశ్ భార్యగా నటించే చాన్స్ వచ్చిందనే న్యూస్ బయటకు వచ్చింది. ధనుష్ హీరోగా నటించగా వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన తమిళ మూవీ 'అసురన్' బ్లాక్బస్టర్ హిట్టయింది. దాని తెలుగు రీమేక్ రైట్స్ చేజిక్కించుకున్న డి. సురేశ్బాబు, ఆ మూవీని తన తమ్ముడు వెంకటేశ్ హీరోగా రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. తమిళంలో మంజు వారియర్ చేసిన కేరెక్టర్ను తెలుగులో శ్రియ చేస్తుందనే ప్రచారం జరుగగా, ఇప్పుడు ఆమె స్థానంలో అనుష్క పేరు వినిపిస్తోంది. అదే నిజమైతే.. 'చింతకాయల రవి', 'నాగవల్లి' సినిమాల తర్వాత మూడోసారి ఆ ఇద్దరూ కలిసి నటించినట్లవుతుంది.