మెగా ప్రిన్సెస్ కి బంగారు ఊయల పంపిన అంబానీ!
on Jun 30, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలో సంతోషం నెలకొంది. కాగా ఈరోజు పాప బారసాల వేడుకను ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా ఓ బంగారు ఊయలను మెగా ప్రిన్సెస్ కి కానుకగా పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
పాప లేదా బాబు ఎవరు పుట్టినా, ఏం పేరు పెట్టాలనేది తాము ముందే నిర్ణయించుకున్నామని రీసెంట్ గా రామ్ చరణ్ చెప్పాడు. పాప పుట్టి నేడు 11వ రోజు కావడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం బారసాల వేడుక చేసి పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పాప పేరుని త్వరలోనే రామ్ చరణ్, ఉపాసన దంపతులు అభిమానులతో పంచుకునే అవకాశముంది. ఇదిలా ఉంటే మెగా ప్రిన్సెస్ కోసం కోటి రూపాయల విలువైన బంగారు ఊయలను అంబానీ కానుకగా పంపారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



