అమెరికాలోని టాంపా నగరానికి చీఫ్ గెస్ట్ అల్లు అర్జున్!.
on May 21, 2025
అమెరికా(America)లో ఉన్న తెలుగు వాళ్ళందరు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) పేరుతో ప్రతి సంవత్సరం తెలుగు సంబరాలని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. గత ఏడేళ్లుగా ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పలువురు సినీ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ తమ స్పీచ్ తో ఈ వేడుకకి మరింత వన్నె తెస్తుంటారు. ఈ క్రమంలోనే 2025 కి సంబంధించిన సంబరాలు జూలై 4 నుంచి 6 వరకు ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా(Tampa)నగరంలో ఉన్న టాంపా కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్నాయి.
ఈ వేడుకలకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నాడు.ఇప్పుడు ఈ న్యూస్ అక్కడ ఉన్న తెలుగు వారిలో ఎనలేని ఉత్సాహాన్ని తెస్తుంది. ఈ క్రమంలో అల్లుఅర్జున్ ఏం మాట్లాడబోతున్నాడనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. వెంకటేష్, రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, మెహర్ రమేష్, థమన్, వివేక్ ఆత్రేయ, కావ్య థాపర్, మానస చౌదరి, సాయికుమార్ తో పాటు మరికొంత మంది నటీనటులు, దర్శకులు ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. అల్లుఅర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రీవియస్ మూవీ 'పుష్ప 2 'విజయం ఇచ్చిన జోష్ తో తన తదుపరి చిత్రాన్ని 'అట్లీ' డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు తెరకెక్కని సరికొత్త 'కథాంశంతో' ఈ చిత్రం తెరకెక్కబోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ మూవీని సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా జులై చివరి వారంలో,లేదా ఆగస్టు మొదటి వారంలో గాని షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
