ఆకాష్ పూరితో ఢిల్లీ గాళ్!
on Nov 28, 2018
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు అనిల్ ఓ సినిమా తెరకెక్కించాడనికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి 'వాస్కోడిగామా' టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. డిసెంబర్ నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ఏంటంటే... ఈ సినిమాలో కథానాయికగా ఢిల్లీకి చెందిన గాయత్రీ భరద్వాజ్ అనే మోడల్ను ఎంపిక చేశారట. ఆమెకు ఇదే తొలి సినిమా. గాయత్రీ భరద్వాజ్ కంటే ముందు పలువురు అమ్మాయిలను దర్శకుడు అనిల్ ఆడిషన్స్ చేశారనీ, గాయత్రీని కూడా రెండుమూడు సార్లు ఆడిషన్ చేసిన తరవాతే ఎంపిక చేశారని ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ కథ అందిస్తున్నారు. సినిమానూ ఆయనే నిర్మిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
