వేసవి బరిలో వలిమై?
on Nov 28, 2020
నేర్ కొండ పార్ వై (పింక్ తమిళ రీమేక్) తరువాత కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం వలిమై. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నాయికగా నటిస్తున్న ఈ తమిళ సినిమాలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుండగా.. యువన్ శంకర్ రాజా బాణీలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని తొలుత 2021 సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో చిత్రీకరణలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో.. 2021 వేసవి ఆరంభంలో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రిలీజ్ చేయాలని వినోద్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట.
వేసవిలో విడుదలైన పలు అజిత్ చిత్రాలు విజయం సాధించిన నేపథ్యంలో.. వలిమై కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.