ఇంత కంటే నేనేం అడగలేను..ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ పోస్ట్
on Apr 23, 2024
ఐశ్వర్య రాజేష్..ఎవరి అండ దండలు లేకుండా కేవలం తన నటనని మాత్రమే నమ్ముకొని ముందుకు దూసుకుపోతుంది. తెలుగు, తమిళ భాషలకి చెందిన పలు చిత్రాల్లో నటిస్తు బిజీ ఆర్టిస్ట్ గానే ఉంది. లేటెస్ట్ గా డియర్ అనే ద్విబాషా చిత్రంతో మంచి పేరు సంపాదించింది. తాజాగా తన ట్విటర్ లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆమె స్థాయిని చెప్తుంది.
ఐశ్వర్య రాజేష్ కన్నడ సినీ సీమలోకి అడుగుపెట్టబోతోంది. ఉత్తరకాండ అనే మూవీతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.ఇందులో హీరో ఎవరో కాదు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. దీని గురించే ఐశ్వర్య తన ట్విటర్ లో పోస్ట్ చేసింది.పైగా పోస్టర్ ని కూడా ఉంచింది.అందులో ఐశ్వర్య లుక్ చాలా వెరైటీ గా ఉంది. గొడుగు వేసుకొని ఏదో ఒక విషయాన్నీ తదేకంగా చూస్తున్నఆ లుక్ పలువురిని ఆకర్షిస్తుంది. అలాగే దుర్గి అనే క్యారక్టర్ లో కనిపించబోతుందని కూడా అర్ధం అవుతుంది.ఇక అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇంక ఏం అడగగలను అనే క్యాప్షన్ ని ఉంచింది. దీన్నిబట్టి ఈ అవకాశం ఆమెకి ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఒకప్పుడు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన దివంగత నటుడు రాజేష్ కూతురే ఐశ్వర్య రాజేష్
రోహిత్ పడకి దర్శకత్వంలో ఉత్తరకాండ తెరకెక్కుతుంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కె ఆర్ జి స్టూడియోస్ పై కార్తీక్ గౌడ,యోగి రాజ్ లు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ హిట్ మూవీ వీరసింహారెడ్డి లో విలన్ గా చేసిన ధనంజయ, సప్త సాగరాలు దాటి సైడ్ బి ఫేమ్ చైత్ర జే ఆచార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో భారీ చిత్రాలకి కంపోజ్ చేసిన బాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also Read