ఐశ్వర్యా రాయ్: ఒక టెస్ట్లో నెగటివ్.. ఇంకో టెస్ట్లో పాజిటివ్!
on Jul 12, 2020
అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తర్వాత తల్లీ కూతుళ్లు ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య బచ్చన్ కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ రిపోర్టులు వచ్చాయి. మరోవైపు, అమితాబ్ భార్య జయా బచ్చన్, కుమార్తె శ్వేతా నందా, ఆమె పిల్లలు నవ్య నవేలీ నందా, అగస్త్య నందా టెస్టుల్లో నెగటివ్గా తేలారు. గమనించాల్సిన విషయమేమంటే, శనివారం సాయంత్రం జయా బచ్చన్, ఐశ్వర్య ఇద్దరూ యాంటీజెన్ టెస్ట్లు చేయించుకున్నారు. ఇద్దరికీ నెగటివ్ అని వచ్చింది.
అయినప్పటికీ వాళ్లు.. ఆరాధ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈసారి స్వాబ్ టెస్టులు చేయించుకున్నారు. అందులో ఐశ్వర్య కొవిడ్-19 పాజిటివ్గా స్పష్టమైంది. ఇప్పటికైతే జయ, శ్వేత, నవ్యనవేలీ, అగస్త్య క్షేమమని తేలింది. కాగా అమితాబ్ నివాసం 'జల్సా'ను బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు శానిటైజ్ చేసి, దాన్ని సీజ్ చేశారు. ఆ చోటును కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించారు.