వివాదంలో 'ఆదిపురుష్' దర్శకుడు.. తిరుమలలో ఇదేం పని!
on Jun 7, 2023
దేవుడి గురించి సినిమా తీయడం కాదు.. దేవుని ప్రాంగణంలో ఎలా నడుచుకోవాలో కూడా తెలియాలి. లేదంటే భక్తుల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ కి అలాంటి పరిస్థితే ఎదురైంది. తిరుమల దేవాలయ ప్రాంగణంలో ఆయన హీరోయిన్ కృతి సనన్ ని ముద్దు పెట్టుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటించింది. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న తిరుపతిలో మూవీ ప్రీరిలీజ్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనడానికి తిరుపతి వచ్చిన ఓం రౌత్, కృతి సనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరే సమయంలో ఓం రౌత్, కృతి సనన్ ని హగ్ చేసుకొని, కిస్ చేసుకున్నాడు. సినీ ప్రముఖులు కలిసినప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకోవడం,ముద్దుపెట్టుకోవడం తరచూ చూస్తుంటాం. బాలీవుడ్ లో ఇది చాలా సాధారణం. అయితే ఇందులో ఏ తప్పుడు ఉద్దేశం లేనప్పటికీ ఏదో సినిమా వేడుకలో లాగా, దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఇలా ముద్దు పెట్టుకోవడం ఏంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓం రౌత్, కృతి సనన్ ని హత్తుకొని, ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read