జూలై5న ఆది బుర్రకధ....మరో సమస్య ఎదురవుతుందా ?
on Jun 29, 2019
ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ఫేమస్ డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా బుర్రకథ. దీపాల ఆర్ట్స్ బ్యానర్ మీద హెచ్కె శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవీ కిరణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది సరసన మిష్టి చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, గాయత్రి గుప్తా తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నిన్న రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ జూన్ 28 నుంచి జూన్ 29కు షిఫ్ట్ అయిందని నిన్న చిత్ర బృందం వెల్లడించింది. అంటే ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది, అయితే నిన్న సాయంత్రానికి కూడా సెన్సార్ అద్దంకి తొలగకపోవడంతో ఈ సినిమని వచ్చే శుక్రవారం అంటే జూలై 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు నిర్మాతలు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది సినిమా యూనిట్. ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా ద్వారా కిరణ్, ప్రసాద్ కామినేని, సురేష్, దివ్య భావన బండ్ల, సయీద్ తాజుద్దీన్ లు నలుగురూ ఓకే సారి ఓకే సారి స్క్రీన్ ప్లే రచయితలుగా పరిచయమవుతున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మరో ఇబ్బంది ఎదురు కానుంది. అదే థియేటర్స్ సమస్య ఎందుకంటే ఈ సినిమా వాయిదా పడిన తేదీ జూలై ఐదున రెండు సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. ఓబేబీ, దొరసాని ఈ రెండు సినిమాలూ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థే రిలీజ్ చేస్తుంది. దీంతో వారి థియేటర్స్ తో పాటు గీతా కాంపౌండ్ థియేటర్స్ అలాగే దిల్ రాజు థియేటర్స్ లో ఎవరివో ఒకరికి తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో మళ్ళీ ఈ సినిమా వాయిదా పడితే ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఖచ్చితంగా పడుతుంది. లేదని ఎలాగోలా ధైర్యంగా ముందుకు వెళ్తే కష్టమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి ఏమవనుందో ?
Also Read