ఒక్క దెబ్బతో 500 కోట్ల రైటరయ్యాడు!!
on Jul 21, 2015
అతను రాసిన కథలు తెలుగులో సూపర్ హిట్లయ్యాయి, బ్లాక్ బ్లాస్టర్లు గా నిలిచాయి, కొత్త రికార్డులు సృష్టించాయి కానీ అప్పుడు అతని కి రాని గుర్తింపు రెండు కథలతో వచ్చేసింది. అతను ఎవరో కాదు తెలుగు సినిమా సక్సెస్ ఫుల్ స్టొరీ రైటర్ కే. విజయేంద్రప్రసాద్. మన దర్శకధీరుడు రాజమౌళి ఫాదర్.
ఆయన రాసిన రెండు కథలు 'బాహుబలి'..'భజరంగి భాయ్ జాన్' లు ఆయన్ని మోస్ట్ వాంటెడ్ ఇండియన్ స్టొరీ రైటర్ లిస్ట్ లో చేర్చాయి. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమా రికార్డులను తుడిచిపెట్టి 350 కోట్ల గ్రాస్ సాధించగా, రంజాన్ కానుకగా రిలీజైన సల్మాన్ ఖాన్ 'భజరంగి భాయ్ జాన్' రికార్డులను సృష్టిస్తూ కేవలం మూడు రోజులో 100 కోట్లకు పైగా వసూళ్ళను సాధించి౦ది.
'భజరంగి భాయ్ జాన్' అయితే సల్మాన్ ఖాన్ కేరియాలో బెస్ట్ మూవీగా ఫిల్మ్ క్రిటిక్స్ ముద్ర వేశారు. సల్మాన్ మాత్రం ఈ క్రెడిట్ అంతా స్టొరీ రైటర్ విజయేంద్రప్రసాద్ కే దక్కాలని చెప్పడం విశేషం. ఈ రెండు సినిమాల సక్సెస్ దెబ్బకి ఏ నేషనల్ మీడియా ఛానెల్ చూసిన విజయేంద్రప్రసాద్ గురించే చర్చిస్తున్నారు. 500 కోట్ల రైటర౦టూ తెగ పొగిడేస్తున్నారు. దీంతో మన తెలుగువారు తెగ సంబరపడిపోతున్నారు. కొడుకు రాజమౌళి 300 కోట్ల దర్శకుడైతే..తండ్రి 500 కోట్ల రైటరయ్యాడని హ్యాపీగా ఫీలవుతున్నారు.