దిమ్మ తిరిగేలా ముంబైలో రౌడీ హీరో విజయ్ క్రేజ్!
on Aug 1, 2022
పాన్ ఇండియా సినిమాలతో సౌత్ హీరోలు నార్త్ లో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ చేయకుండానే నార్త్ లో ఊహించని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్స్ సైతం విజయ్ ఆటిట్యూడ్ కి ఫిదా అయ్యారు. అయితే తాజాగా విజయ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'లైగర్' ప్రమోషన్స్ లో ముంబైలో రౌడీ హీరో క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ముంబైలోని ఓ మాల్ లో మూవీ టీమ్ ప్రమోషన్ ఈవెంట్ చేయగా.. విజయ్, అనన్యను చూసేందుకు పెద్ద ఎత్తున ఆడియన్స్ వచ్చారు. వేల సంఖ్యలో జనాలు హాజరు కావడంతో.. ఆ మాల్ క్రికెట్ స్టేడియంని తలపించింది. ఒకానొక టైంలో క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక సెక్యూరిటీ సిబ్బంది చేతులెత్తేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో మూవీ టీమ్ మధ్యలోనే ఈవెంట్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. విజయ్ కి నార్త్ లోనూ మంచి క్రేజ్ ఏర్పడిందని ముందు నుంచి అందరికీ తెలిసిందే. కానీ అందరి అంచనాలకు మించి ఎన్నో రెట్ల ఎక్కువ క్రేజ్ ఉందని 'లైగర్' ప్రమోషనల్ ఈవెంట్ తో రుజువైంది. మరి సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ ముందు ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, అలీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనుండటం విశేషం.
Also Read