నేను సింగల్...బ్రేకప్ ఒప్పుకున్న త్రిష
on May 8, 2015
.jpg)
వరుణ్ మనియన్ తో బ్రేకప్ జరిగిపోయిన విషయాన్ని త్రిష అఫీషియల్గా ప్రకటించింది. ''నా గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వందల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..వాటిని వదిలేయండి..నేను ఆనందంగా సింగల్ గా వున్నాను''అంటూ ట్విట్టర్ లో తెలియజేసింది త్రిష. వరుణ్ మనియన్ తో నిశ్చితార్థo తరువాత జాయింటుగా నిర్వహించిన పార్టీలో వచ్చిన గొడవ వీరి బ్రేకప్కి దారి తీసిందని తెలుస్తోంది. ఇన్నాళ్ళు దీనిపై త్రిష స్పందించకపోవడంతో అవన్ని రూమర్లేనని అందరూ అనుకున్నారు. కానీ త్రిష దీనిపై క్లారిటీ ఇవ్వడంతో నిజమని తేలిపోయింది. త్రిష తన మనసు చెప్పినట్టు నడుచుకొందని, పెళ్ళి చేసుకొని విడిపోయే బదులు..ఇప్పుడే విడిపోతే మంచిదని భావించినట్టు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



