మొగుడు పోయాడని... ఆవిడను కెలికాడు
on Sep 21, 2020
తెలుగులో కొత్త దర్శకులు డిఫరెంట్, వెరైటీ కాన్సెప్ట్ కథలతో వస్తున్నారు. కౌషిక్ పెగళ్లపాటి అయితే మరీ వెరైటీ కథతో వస్తున్నట్టున్నాడు. అతడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ హీరోగా ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న సినిమా కావడంతో ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన వెంటనే సినిమా ప్రేమికులంతా ఆ టీజర్ చూశారు.
హీరోది శవాలను స్మశానానికి తీసుకువెళ్లే బండి క్యారెక్టర్ కావడం వెరైటీ అయితే... ఫస్ట్ గ్లింప్స్లో డైలాగులు, హీరో క్యారెక్టరైజేషన్ ఇంకా వెరైటీగా ఉన్నాయి. ‘యదవ నాయాలా... చెత్త నా కొడకా... శవాన్ని తోలుకుపోరా అంటే? మొగుడు పోయినదాన్ని కెలికొచ్చాడు’ అని హీరోని అమ్మ పాత్రలో నటించిన ఆమని తిట్టే సన్నివేశం కళ్లప్పగించి చూసేలా చేసింది. అసలు, దాని తర్వాత హీరో చెప్పే డైలాగ్ అయితే షాక్ ఇచ్చింది. ‘ఆడు ఎట్టాగో పోయాడు కదే! ఇప్పుడది ఖాళీయే’ అని తాను చేసిన పనిని హీరో సమర్ధించుకుంటాడు. హీరో క్యారెక్టర్ మాంచి మాసీగా ఉంది.
‘నేను రోజూ చావులకు పోతా. అందరి ఏడుపులు చూసి చూసి... ఏడుపు అంటేనే చిరాకు దొబ్బింది. కానీ, ఆ పిల్ల ఏడుత్తుంటే మాత్రం చేతికున్న వెంట్రుకలు ఇట్టా లేచి నించున్నాయిరా’ అని హీరో అనడం చూస్తుంటే... శవం దగ్గర ఏడుస్తున్న అమ్మాయిని చూసి ప్రేమలో పడినట్టు ఉన్నాడు. ఆ డైలాగ్కి భద్రం ఇచ్చిన కౌంటర్ డబుల్ మీనింగ్లో ఉంది. మొత్తం మీద ఈ సినిమా ‘ఆర్ఎక్స్ 100’ రేంజ్ హిట్ను కార్తికేయకు ఇచ్చేలా ఉంది.
Also Read